జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నాలుగేళ్లు. నాటి దాడిలో 40మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాడు అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని ఆయన ట్వీట్ చేశారు. 2019 ఫిబ్రవరి 14న మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు .జమ్మూ నుంచి శ్రీనగర్కు 2,500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ టక్కుల్లో వెళ్తుండగా ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి తెగబడ్డారు. అయితే పుల్వామా దాడి తరువాత భారత వాయుసేన జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామని భారత్ ప్రకటించింది.
https://twitter.com/narendramodi/status/1625324032295055361?s=20&t=MUziEn_Bc3jnPpp1V_L-qw