మరో నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కు రానున్నాయి. దీంతో మన వైమానిక దళంలో వాటి సంఖ్య 18కి చేరనుంది. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్లోని మెరిగాక్ వైమానిక శిక్షణా కేంద్రం దగ్గర జెండా ఊపి వీటిని ప్రారంభించారు. సకాలంలో రఫేల్ విమానాలను భారత్కు అప్పగిస్తున్నందుకు ఫ్రాన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నాలుగు రాఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి 8000 కి.మీ ప్రయాణించి …నేరుగా భారత్ కు చేరుకోనున్నాయి.
నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్ రెండో స్క్వాడ్రన్ ఏర్పాటు మరింత వేగవంతం కానుండగా.. పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. మొదటి స్క్వాడ్రన్ను అంబాలా ఏర్బేస్లో ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్రన్లో 18 యుద్ధ విమానాలు ఉండనున్నాయి. సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. . గతేడాది జూలై 29న రాఫెల్ మొదటి బ్యాచ్ జెట్లు భారత్ కు చేరాయి.
https://twitter.com/IAF_MCC/status/1384917766206115841?s=20