ఉత్తరాఖండ్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. అనేక జంతువులు ప్రాణాలు విడిచాయి. రాష్ట్రంలోని ఘర్వాల్,కుమవూన్ ప్రాంతాల్లో శనివారం నాడు ఈ కార్చిచ్చు చెలరేగింది. నైనిటాల్, అల్మోరా జిల్లాల్లో కార్చిచ్చు ప్రభావం పడింది. పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు వేల మంది సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం తీరత్ సింగ్ రావత్.. కేంద్రాన్ని సహాయం చేయాలని కోరుడంతో.. వెంటనే స్పందించిన కేంద్రం రెండు హెలికాప్టర్లను, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపింది. ఇప్పటికే 62 హెక్టార్ల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. కేంద్రం పంపిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.