యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో టాప్ టెన్ లో మొదటి నలుగురు అమ్మాయిలే. టాపర్గా ఇషితా కిషోర్ నిలవగా…గరిమా లోహియా, ఉమా హారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. వీరు కాక ఆరు, తొమ్మిదోర్యాంకర్లూ యువతులే. ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 మెరిట్ లిస్ట్లో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. https://upsc.gov.in/ వెబ్సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది జూన్ 5న జరగ్గా..మెయిన్స్ సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించారు. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి.