కోవిడ్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో అయితే పెద్దఎత్తున కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్లో నలుగురు విదేశీయులకు కరోనా సోకినట్టు తేలింది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం గయలో ఉన్న బౌద్ధగురువు దలైలామాను కలిసేందుకు వారు భారత్ వచ్చినట్టు తెలిసింది. ఇంకా పెద్దసంఖ్యలోవివిధ దేశాలనుంచి ఆయనకోసం గయకు తరలివస్తున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్ సహా పలుచోట్ల పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న 38మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. చైనా నుంచి బెంగళూరుకు వచ్చిన మరో వ్యక్తికీ కోవిడ్ ఉన్నట్టు తేలింది.