https://twitter.com/ShriRamTeerth/status/1371477185739976707/photo/1
యూపీలోని అయోధ్య రామ మందిర నిర్మాణ పునాది పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు పూజా కార్యక్రమాలు చేసి పునాది పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటుగా.. ట్రస్టు సభ్యులు, జిల్లా మెజిస్ట్రేట్, డీఐజీ పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 13000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామ మందిర పునాదిని నిర్మిస్తున్నారు. నేలమట్టం నుంచి 25 అడుగుల ఎత్తువరకు పునాదిని నిర్మించనున్నారు. ఇందుకోసం.. అక్కడి భూమిపైన ఇసుక,మట్టితో పాటు పలు పదార్ధాలతో 50 పొరలను వేస్తున్నట్లు సమాచారం.