కరోనా మహమ్మారి కాటుకు మరో కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ నేత దిలీప్ మన్సుఖ్లాల్ గాంధీ మరణించారు. ఆయన వయస్సు70 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. 1951, మే 9వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు. ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. బీజేపీ జిల్లా సంస్థలో ప్రధాన కార్యదర్శిగా, జాయింట్ సెక్రెటరీగా, అధ్యక్షుడిగా కూడా పదవులను చేపట్టారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ మునిసిపల్ కార్పోరేషన్లో కౌన్సిలర్గా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం అహ్మద్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నికయ్యారు. 2003, జనవరి 29వ తేదీ నుంచి 2004 మార్చి 15వ తేదీ వరకు విదేశాంగ శాఖ, షిప్పింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దిలీప్ గాంధీ మృతిపట్ల బీజేపీ అగ్రనేతలు సంతాపాన్ని ప్రకటించారు.