గతంలో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ను నిర్బంధంలోకి తీసుకుని…చిత్రహింసలు పెట్టి…`కాషాయ ఉగ్రవాదం’ నిజమేనని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ దేశం విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. రష్యాపారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
సింగ్ కెరియర్ మొత్తం వివాదాల మయమే. పలు కేసుల్లో ఆయన దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారు నిలిపి ఉంచిన కేసులో అరెస్టయిన సచిన్ వాజేతో సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సింగ్ రష్యాకు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆయనపై ఉన్న అభియోగాల విచారణ కోసం చందీవాల్ కమిషన్ వేశారు. విచారణకు హాజరుకావాలని లుకౌట్ నోటీసులు జారీఅయ్యాయి.
కొద్దినెలల క్రితం హోమ్ గార్డ్ విభాగం వెళ్లిన సందర్భంగా… అప్పటి హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ హోటల్, బార్ యజమానులు నుండి ముడుపులు వసూలు చేయమని పోలీస్ అధికారులను ఆదేశించారని సంచలన ఆరోపణలు చేశారు సింగ్. దాంతో హోంమంత్రి దేశ్ ముఖ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నాలుగు దోపిడీ కేసులలో నిందితుడిగా ఉన్న పరమ్బీర్ సింగ్ సహా మరికొందరిని సస్పెండ్ చేయమని మహారాష్ట్ర పోలీసు విభాగాధిపతి సంజయ్ పాండే ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
సింగ్ ఏటీఎస్ అదనపు కమిషనర్ గా ఉన్న సమయంలో ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ ను నిర్బంధంలోకి తీసుకుని…కాషాయ ఉగ్రవాదం నిజమేనని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రజ్ఞానే స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. 13 రోజులపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి, చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. 2009లో ముంబైలో ఉగ్రదాడి అనంతరం పరంబీర్, మరో ముగ్గురు పోలీస్ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ హైకోర్టు లో పిటీషన్ దాఖలయింది. వారు అప్పటి పోలీస్ కమిషనర్ ఆదేశాలను పాటించలేదంటూ పిల్ దాఖలయింది.
సింగ్ మీద చాలాఏళ్లుగా ఇంకా అనేక ఆరోపణలున్నాయి. సలీల్ చతుర్వేది అనే వ్యాపారిపై అక్రమంగా డ్రగ్ కేసు నమోదు చేశారు. తనకింది పోలీసులతో అతనిఇంట్లో మాదకద్రవ్యాలను తానే పెట్టించినట్టు సీఐడీ విచారణలో తేలింది కూడా. గత ఫిబ్రవరిలో నగర పోలీస్ కమిషనర్ గా సింగ్ నియమితులయ్యారు. సాగునీటి కుంభకోణాల్లో నాటి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇచ్చారు సింగ్. ఇక సంచలనం రేపిన సుషాంత్ రాజ్ పూత్ అనుమానాస్పద మృతి కేసులోనూ సుషాంత్ ది ఆత్మహత్యగా కావాలని చిత్రీకరించాలనే ఆరోపణలూ ఎదుర్కొన్నారు. కానీ అది నిజంకాదని తరువాత తేలింది. బాలీవుడ్ నటి కంగనాను అవమానిస్తూ ట్వీట్లు చేయించారనే ఆరోపణలూ వచ్చాయి.
ఆయన కోసం వెదుకుతున్నామని మహారాష్ట్ర హోంమంత్రి తెలిపారు. పరమ్ బీర్ సింగ్ నిజంగా దేశం విడిచి వెళ్లింది నిజమైతే క్షమించేది లేదని స్పష్టం చేశారు. విచారణ ఎదుర్కొంటున్న ఎవరూ కూడా ప్రభుత్వానికి తెలియజేయకుండా దేశం నుంచి విడిచి వెళ్లకూడదని, ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలనీ అన్నారు.