ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధవాను అన్ని పదవులు, ధ్యతల నుంచి తొలగించింది బీజేపీ. టీ ట్వంటీ ప్రపంచ కప్ లో…ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత విక్రమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
22, 23 ఏళ్ల ఈ అమ్మాయులు జమ్మూలో బుర్ఖాలు వేసుకుని తిరుగుతున్నారు. కశ్మీర్లో మాత్రం జాకెట్లు గాల్లో విసురుతూ పాక్ అనుకూల నినాదాలు చేస్తున్నారు అని విక్రమ్ అన్నారు. అలాంటి వాళ్లను కొట్టి చంపాలి, భారత గడ్డపై ఉంటూ..దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ, పాక్ అనుకూల నినాదాలు చేసేవాళ్లకి మరిచిపోలేని శిక్ష విధించాలి…అసలు అలాంటి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్లో…వాళ్లనూ శిక్షించాలని విక్రమ్ అన్నారు.
విక్రమ్ ఈ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ క్రమశిక్షణా కమిటీ షో-కాజ్ నోటీసును జారీ చేసింది.ఒక మతాన్ని ప్రస్తావిస్తూ…వారిపై ద్వేషం పెంచే వ్యాఖ్యలు చేశారని …అది ఆమోదయోగ్యం కాదని…పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఆయన వ్యాఖ్యలున్నాయని పార్టీనేతలు అభ్యంతరపెట్టారు.