బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటేవలే తన పార్టీని విలీనం చేసి జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరగా..అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గులాబీకి గుడ్ బై చెప్పి…. కమలదళంలో చేరిపోయారు. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయం సమక్షంలో ఢిల్లీలో ఆయన పార్టీ మారారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సురేష్ కూడా బీజేపీలో చేరారు.
తన నివాసంలోనేభిక్షమయ్యగౌడ్కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు భిక్షమయ్య గౌడ్ తెలిపారు.
2009లో ఆలేరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు భిక్షమయ్య. తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల అనంతరం ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు తాను 2018లో టీఆర్ఎస్లో చేరినా అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయలేదని అందుకే పార్టీ మారుతున్నట్టు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)