మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది. అరెస్ట్ పై మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ అక్రమమని కొట్టిపారేసిన ఆయన..అర్థరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేశారన్నారు.
వైసీపీ నేతల్లా అయ్యన్న అక్రమాలు, భకబ్దాలు చేయలేదని. సొంత బాబాయిని చంపలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు విశాఖలో వేలాది ఎకరాలను కబ్జా చేశారని అందుకు వ్యతిరేకంగా పోరాడితే అరెస్ట్ చేస్తారా అని బాబు నిలదీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.పోలీసులపై చట్టపరంగా చర్యలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.