హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్(87) కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.