విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ డీజీపీ, కాంగ్రెస్ నేత సిద్దూ సలహాదారు మహ్మద్ ముస్తఫాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ కార్యక్రమాల సమీపంలో ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించారు. జనవరి 20 నాడు హిందువులను బెదిరించినట్టుగా తెలిసింది.

Mohammad Mustafa
ముస్తఫాపై IPCలోని సెక్షన్ 153-A ,ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం ఓ వర్గాన్ని బెదిరించడం ద్వారా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రేపే ప్రయత్నం చేశారని కేసు నమోదు చేశారు. వీడియో సమాచారం రాగానే…కేసు నమోదు చేశామని…విచారించి ముస్తఫా వివరణ కూడా తీసుకుంటామని మలేర్ కోట్ల ఎస్ఎస్పీ రవ్ జోత్ గ్రేవాల్ చెప్పారు.
https://twitter.com/ANI/status/1485169060291973123?s=20
మలేర్ కోట్ల పట్టణంలో తన కార్యక్రమానికి ఆప్ కార్యకర్తలే అంతరాయం కలింగించారని ముస్తఫా అంటున్నారు. ఈ ఆరోపణల్ని ఖండించారు. AAP అభ్యర్థి జమీల్ ఉర్ రెహ్మాన్ . ముస్తఫా మతరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
https://twitter.com/MohdMustafaips/status/1484923841960837122?s=20
మలేర్కోట్లలోని సిరిండి గేట్ సమీపంలోని బగ్వాలా మొహల్లా వద్ద గురువారం సాయంత్రం AAP బహిరంగ సభ ఉండే…
ముస్తఫా వచ్చి తమ వాళ్లను హెచ్చరించారని… ముస్లింలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటూ ట్వీట్ చేశారు.
మలేర్కోట్ల కాంగ్రెస్ అభ్యర్థి రజియా సుల్తానా ముస్తాఫా భార్యనే. పంజాబ్ మాజీ డీజీపీ అయిన ఆయన… గతేడాది ఆగస్టులో రిటైర్డ్ అయిన నాటినుంచి సిద్దూకు ప్రధాన సలహాదారుగా ఉన్నారు.
ముస్తాఫా హిందువులను బెదిరిస్తున్నట్టు ఉన్న ఆ వీడియో బీజేపీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ షేర్ చేశారు.ఎన్నికల వేళ ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. సిద్దూ వెనక ఉండి …శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు.
https://twitter.com/shaziailmi/status/1484560304549814276?s=20