ఆర్ఎస్ఎస్ను “హిట్లర్ పార్టీ”తో పోల్చిన మాజీ సీఎం..!
https://twitter.com/ANI/status/1361491097499787264
దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర నిర్మాణానాకి నిధి సమర్పణ అభయాన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై పలు చోట్ల రాజకీయ పార్టీలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం నిధి సమర్పణ ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమార స్వామి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ జర్మనీకి చెందిన నాజీ పార్టీల వ్యవహరిస్తుందని.. హిట్లర్ను తలపించేలా వీరి కార్యక్రమాలు ఉంటున్నాయని ఆరోపించారు. మందిర నిర్మాణానికి నిధి సమర్పణ చేసిన ప్రజల ఇళ్లను గుర్తించారని.. అదే విధంగా ఇవ్వని వారి ఇళ్లను కూడా గుర్తించారని.. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన కల్గుతోందంటూ వరుస ట్వీట్స్ చేశారు. అయితే ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ అధికారులు ఖండించారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నిధి సమర్పణ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చురుగ్గా సాగుతోందని అన్నారు.