జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరికి అడవే ఐసోలేషన్ అయింది..మహాముత్తారం మండలం అటవీగ్రామం యత్నారంలో కొందరికి కరోనాసోకింది..అక్కడ వారిని పట్టించుకునే దిక్కుకూడాలేదు..దీంతో వారు అడవినే ఐసొలేషన్ గా మార్చుకున్నారు. 3 రోజుల్లో 34 మంది కరోనా బారినపడ్డారు.
ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురికి కోవిడ్ సోకింది. ఇళ్లలోనే ఉంటే మిగిలినవాళ్లకూ వైరస్ సోకుందని ఆ ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది గ్రామశివారులోని అటవీ ప్రాంతాన్ని ఐసొలేషన్గా మార్చుకున్నారు. కొందరు అక్కడే వంట చేసుకుని తింటుంటే…మరికొందరికి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు.