దక్షిణ కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ 68 నీటి రిజర్వాయర్లను నిర్మించనుంది, ఇది పర్యావరణానికి సహాయపడటమే కాకుండా స్థానిక ప్రజలకు, అలాగే ట్రెక్కర్ లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. CAMP స్కీం, CAPEX బడ్జెట్ కింద అటవీ శాఖ కొత్త నీటి రిజర్వాయర్లను నిర్మిస్తుందని ఫారెస్ట్ సౌత్ కశ్మీర్ కన్జర్వేటర్ ఇర్ఫాన్ అలీ షా వెల్లడించారు. ఇప్పటి వరకు 16000 మొక్కలు నాటారు.
కున్సర్ నాగ్ కుల్గామ్కు వెళ్లే ట్రెక్కింగ్ల కోసం త్వరలో ‘ఎకో టూరిస్ట్ హట్’ను నిర్మిస్తున్నామని.. ఇది వారికి విశ్రాంతి స్థలంగా కూడా ఉంటుందని అలీ షా చెప్పారు.
“మేం కుల్గామ్లోని అటవీ ప్రాంతంలో 20 చెరువులను పునరుత్పత్తి చేస్తున్నాం, ఇవి నీటి రిజర్వాయర్లుగా పనిచేయడమే కాకుండా వేసవిలో ఈ ప్రాంతంలో ఉండే సంచార జనాభాకు చెందిన పశువులకు కూడా ఉపయోగపడతాయి” అని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో అటవీ భూమికి కంచెలు నిర్మించే పనిలో ఉంది.