రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేపథ్యంలో భారత వైఖరికి మద్దతు తెలిపాయి విపక్షాలు. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే సరైందని మూకుమ్మడిగా స్పష్టం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసిన సందర్భంగా ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండడాన్ని సమర్థించాయి. అక్కడి తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో విదేశీవ్యవహారాల శాఖ సంప్రదింపుల కమిటీ నిర్వహించిన సమావేశంలోఅన్ని పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు.
కమిటీలో ఉన్నరాహుల్ గాంధీ, శశిథరూర్,ఆనంద్ శర్మ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న విపక్షాలకు కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.