ఓ వైపు కరోనా చావులు, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో విసిగి వేసారిన ఓ యువకుడు బలవంతంగా ఉసురుతీసుకున్నాడు. వరంగల్ సునీల్ నాయక్ ఘటన మరువక ముందే… నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కారు ఎలాంటి నోటిఫికేషన్లు వేయడం లేదని…కష్టపడి చదివి ప్రయోజనం లేకుండా పోయిందని ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయమై తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పురుగులమందు తాగి చనిపోయాడు.