ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కవిత ఈడీ కార్యాలయానికి విచారణకు రావడం ఇది మూడోసారి. నిన్న రెండోసారి పిలిపించుకున్న ఈడీ అధికారులు ఆమెను పదిగంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా విచారణకు వెళ్లేందుకు సిద్ధమవుతూ తాను వాడిన వాడుతున్న ఫోన్లను ప్రదర్శించారు కవిత. కవిత పది మొబైళ్లను వాడారని ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ధ్వంసం చేసినట్టూ ఆమెమీద ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగానే కవిత తన ఫోన్లు తీసుకెళ్లారని చెబుతున్నారు.మరోవైపు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు కవిత లేఖరాశారు. తాను వినియోగించిన అన్ని ఫోన్లను ఐఎంఈఎం నెంబర్లతో సహా జతపరుస్తున్నట్టు చెప్పారు.నా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ కవితఅభ్యంతరం వ్యక్తం చేశారు.
https://twitter.com/ANI/status/1638056919498719232?s=20