ఒడిషాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ పణిగ్రహి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ.. శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. దియోఘర్లో వరి ధాన్యం సేకరణ జరగడం లేదని.. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముడు పోలేదన్నారు. ప్రభుత్వం రైతుల బాధలను అర్ధం చేసుకోవడం లేదని.. ధాన్యం సేకరణపై దృష్టిపెట్టడం లేదన్న కారణంగానే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.