వాంకిడి పాఠశాలలో గిరిజన బాలిక శైలజ మరణం ఘటన మరిచిపోక ముందే అనేకచోట్ల ఆశ్రమ పాఠశాలల్లో దారుణ పరిస్థితులు బయట పడుతున్నాయి. మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. ముందు రోజు మిగిలిపోయిన అన్నాన్ని పిల్లలకు పెడుతూ ఉండడంతో,, అనేక సందర్భాలలో అనారోగ్యం కలుగుతుంది. ఈ విషయం గురించి పిల్లలు మొత్తుకుంటున్నప్పటికీ టీచర్లు వార్డెన్లు పట్టించుకోవడం లేదు.
తాజాగా మక్తల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులకు వాంతులు అయిపోయాయి. తల నొప్పి, కడుపు నొప్పితో పిల్లలు విలవిలలాడి పోయారు. 108 వాహనం పిలిపించి,
మక్తల్ ఆస్పత్రికి 20 మంది విద్యార్థులను తరలించారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvw pic.twitter.com/6AQJh9frD5
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
మరోవైపు కరీంనగర్ ఉన్నత పాఠశాలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఓల్డ్ హైస్కూల్ లో
పిల్లలకు అందించే భోజనం మాడిపోయి ముద్దుల ముద్దలుగా దర్శనమిస్తోంది.
దీనిపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందారు. నెలరోజుల నుంచి ఇలాంటి అన్నమే పెడుతున్నారు, నీళ్ల సాంబార్ వేస్తున్నారు అని పిల్లలు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే .. ఇవే పెడతాం, తింటే తినండి, లేకుంటే తినకండి అంటూ సిబ్బంది తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో కడుపు మండిన పిల్లలు స్కూలు ఎదుట ధర్నాకు దిగారు.
తెలంగాణలో అనేకచోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది అని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.