భారతదేశంలోనే మొట్టమొదటి ఈ-డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. . అశోక్ లేలాండ్ యొక్క అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ స్విచ్ EiV 22 అని పిలువబడే ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును తయారు చేసింది. అత్యాధునిక సాంకేతికత, అల్ట్రా మోడ్రన్ డిజైన్ , అత్యున్నత భద్రత ,అత్యుత్తమ క్లాస్ కంఫర్ట్ ఫీచర్లు బస్సులో ఉన్నాయి.దేశ రవాణా వ్యవస్థను దీర్ఘకాలిక దృక్పథంతో మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. తక్కువ ఫుట్ప్రింట్ మరియు అధిక ప్రయాణీకుల సాంద్రత కలిగిన ఇంటిగ్రేటెడ్ EV మొబిలిటీ ఎకోసిస్టమ్ను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.