యూపీలోని ఘజియాబాద్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శతాబ్ధి ఎక్స్ప్రెస్లోని జనరేటర్ కార్లో మంటలు మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. జనరేటర్ కారుకు ఆనుకుని ఉన్న పార్శిల్ కోచ్లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పార్శిల్ వ్యాన్లో చెలరేగిన మంటలను వెంటనే అదుపులోకి తేవడంతో.. ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు…