మోసం చేసిన ఆరోపణలతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయినన వైభవ్… ఓ వ్యక్తిని కోట్ల రూపాయలకు మోసం చేసినట్టు తెలిసింది. గెహ్లాట్తో పాటు మరో 15 మంది తనను కోట్లాది రూపాయలు మోసం చేశారని ఆరోపిస్తూ సుశీల్ పాటిల్ అనే వ్యక్తి నాసిక్ లో ఫిర్యాదు చేశారు.
వైభవ్ గెహ్లాట్కు సన్నిహితుడిగా పరిచయం చేసుకున్న సచిన్ వలేరా, రాజస్థాన్ ప్రభుత్వంతో కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి అతని నుంచి రూ.6.80 కోట్లు మోసగించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ముఖ్యమంత్రి కుమారుడిపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో సీఎం వివరణ ఇవ్వాలని పార్టీ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా డిమాండ్ చేశారు. రాజస్థాన్ ప్రజలు నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారనీ అన్నారు.
ప్రభుత్వ ఒప్పందాలతో వ్యవహరించే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భాగస్వామి కావాలని అతను నన్ను అడిగాడు. ఆ కంపెనీ ద్వారా రూ.6.80 కోట్లు పెట్టుబడి పెట్టాను. కానీ రాబడి ఆగిపోయింది. నా పెట్టుబడి తిరిగి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని ఫిర్యాదు దారు ఆరోపించాడు. అంతేకాదు వైభవ్ నుంచి తనకు ప్రాణభయం ఉందనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)