సమాజ్ వాదీ చీఫ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఫిర్యాదుతో ఈటావా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఆదివారం నాటి మూడో విడత పోలింగ్ లో ఆయన సఫారీలోని పోలింగ్ బూత్ లో భార్య డింపుల్ తో కలిసి ఓటేశారు. ఆ సందర్భంగా సీఎం యోగీపై విమర్శలు చేశారు. యోగీ హయాంలో యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. అయితే అఖిలేశ్ వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)