కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా 2 లక్షలు అందచేయనున్నట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు కూడా ఆర్థిక సాయం చేస్తామన్నారు. అందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు మీడియా అకాడమీ ముందుకువచ్చింది.