2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం పూర్తిచేసిన తరువాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆ వెంటనే సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు దివంగతఎంపీ, మాజీ ఎంపీలకు పార్లమెంట్ నివాళులు అర్పించింది. బడ్జెట్ సమర్పించడానికి ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేనుసభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. పలు రంగాల్లో ఆర్థికస్థితిగతులను ఆమె వివరించారు. ఇక 2023-24 కేంద్ర బడ్జెట్ ను బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ .