అమర సైనికునికి అంతిమ వీడ్కోలు..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణించాడు…
ఈరోజు ఉదయం వారి పార్థివదేహం స్వగ్రామానికి చేరుకుంది.
వారి పార్థివదేహానికి అధికారికంగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి..
చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు లు వేల సంఖ్యలో చేరుకుని సంజీవ్ అమర్హై ,జై హింద్,భారత్ మాతాకీ జై అనే నినాదాలతో వారి అంతిమ యాత్రలో పాల్గొని,అమరుడికి అంతిమ వీడ్కోలు పలికారు…