సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన శైలేష్ ఆర్ సింగ్ కొత్త చిత్రం ‘సేతు’ ను తెరకెక్కించనున్నారు. విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2004లో మంజూరైన సేతుసముద్రం షిప్ ఛానల్ ప్రాజెక్ట్ ఆధారంగా ‘సేతు’ సినిమా రూపొందనుంది. 2007లో ఈ ప్రాజెక్ట్పై మధ్యంతర తీర్పు వెలువడింది. ఈ చిత్రాన్ని కోర్టు రూమ్ డ్రామా రూపంలో నిర్మించనున్నారు. సేతు సముద్రం ప్రాజెక్ట్ గురించి ప్రభుత్వ నిర్ణయంతో బాధపడ్డ ఒక సామాన్యుడి కథ సేతు. ఈ ప్రాజెక్ట్ తన ఉనికికి సంబంధించిన ప్రశ్న కంటే తక్కువ ఏం కాదని అతను భావిస్తాడు.. అందువల్ల అతను కోర్టులో ప్రభుత్వాన్ని సవాలు చేయాలని నిర్ణయించుకుంటాడు.
విశాల్ని కలవడానికి ముందు, ఈ అంశానికి సంబంధించి ప్రజలకు ఉన్న ఏకైక సమస్య రామాయణం చుట్టూ ఉందని నేను ఎప్పుడూ అనుకునేవాడినని కానీ విశాల్ తనకు ఎన్నో విషయాలు వివరించారని శైలేష్ చెప్పారు. దానికి బలమైన సామాజిక-ఆర్థిక, భద్రత సహా జాతీయ వారసత్వ ప్రాముఖ్యత ఉందని తెలిశాక సినిమా నిర్మించాలనే ఆసక్తి రెట్టింపైందని అన్నారు. ఓ మంచి కథను ప్రేక్షకుల ముందు తీసుకురానున్నందుకు గర్వపడుతున్నామనీ దర్శక నిర్మాతలు అంటున్నారు.
“స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా మనం బ్రిటీష్ వాళ్ల ప్రభావంలోనే ఉన్నాం. వారు మన రాజకీయాలను, జీవితాలను సహా ఆలోచన ప్రక్రియలను నియంత్రించడమే కాకుండా.. మన సహజ నిల్వలు, వారసత్వాన్ని కూడా హరించుకుపోయారు. సేతు చిత్రం అటువంటి థ్రిల్లర్లో ఒకటి. ఇది మనం ఏమి కోల్పోయాం.. మనం ఏం కోల్పోతున్నాం.. మనం ఏం చేస్తే దాన్ని కాపాడగలమో తెలియజేస్తుంది” అని విశాల్ అన్నారు.
ఇక బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్లను పాక్ స్ట్రెయిట్ సహా పాక్ బే ద్వారా కలుపుతూ కొత్త షిప్పింగ్ లేన్ను రూపొందించే లక్ష్యంతో సేతుసముద్రం ప్రాజెక్ట్ ను 2004లో ప్రారంభించారు. 2005లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించి.. మన్మోహన్ సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఇది వివాదంలో చిక్కుకుంది. అరేబియా సముద్రాన్ని బంగాళాఖాతంతో కలిపేలా గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ బే సహా పాక్ జలసంధి మీదుగా షిప్పింగ్ కెనాల్ను ప్రాజెక్ట్ ప్రతిపాదించింది. దీని కోసం తమిళనాడు, శ్రీలంక మధ్య సేతుసముద్రంలో రామసేతు (రాముడి వంతెన లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు) గుండా వెళుతున్న ఛానెల్ని తవ్వాలి.
వేల సంవత్సరాల క్రితం రాముడు, హనుమంతుడు సహా వానరసేన సముద్రం దాటి శ్రీలంకకు వెళ్లడానికి నిర్మించిన రామసేతులోని ప్రస్తుత భాగాలను ఈ ప్రాజెక్టు ద్వారా భంగం కలిగించడం, కూల్చివేయడం అవసరం కాబట్టి దానిపై చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి రామసేతు భారతదేశ సాంస్కృతిక వారసత్వం.
2007 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో రామసేతు ప్రాంతంలో డ్రెడ్జింగ్ పనులు నిలిచిపోయాయి. శ్రీరాముడి ఉనికిపై నమ్మకం లేని కాంగ్రెస్ పార్టీ.. రాముడు నిర్మించినట్లు విశ్వసించే రామసేతుకు శాస్త్రీయ, చారిత్రక వాస్తవికత లేదని వాదించేందుకు సుప్రీంకోర్టులో 2007లో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే పదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం రామసేతుపై UPA స్టాండ్ను రద్దు చేసింది. రామసేతును తాకకుండా ఉంచాలని నిర్ణయించుకుంది.
‘సేతు’ సినిమా షూటింగ్ 2022 చివర్లో ప్రారంభం కానుంది. 2023 దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను త్వరలో ప్రకటిస్తారు.