కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేని ఆధారంగా వ్యాక్సీన్ల ధరలను నిర్ణయించారో కూడా చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అడిగారు. ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొ రత, బెడ్ల కొరత సహా ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, ఇబ్బందులకు సంబంధించి గురువారం సాయంత్రం లోగా రాష్ట్రప్రభుత్వాలు విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలనీ ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపడతామంది.తమ పరిథిలోని రాష్ట్రాల్లో కేసులను విచారించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తమ కంటే హైకోర్టులకే ఎక్కువ అవగాహన ఉంటుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.