కుక్క కోసం కొట్లాట హైదరాబాద్ వంటి నగరాల్లో చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు. పెంపుడు జంతువుల్ని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. కుక్క కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవ చెలరేగింది. చివరికి తలకాయలు పగలగొట్టుకునేదాకా ఈ గొడవ కొనసాగింది. ఇప్పుడు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది.
రహమత్ నగర్ లో నివసించే శ్రీనాథ్ దంపతులు తమ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు.
ఈ నెల 8వ తేదీన పొరపాటున బెల్టు ఊడదీసుకొని బయటకు వెళ్ళింది. ఎదురు ఇంట్లో వెళ్లిపోయి అక్కడ గడబిడ చేసింది.
దీనితో ఎదురుగా ఉన్న ధనుంజయ్ .. కుక్క యజమాని శ్రీనాథ్ తో గొడవకు దిగారు..
ఈ ఘటన పిఎస్ దాకా చేరింది. ఎలక్షన్ కారణంగా పోలీసులు అంతగా పట్టించుకోలేదు. రెండు వైపులా సర్ది చెప్పి పంపించేశారు.
ఇంట్లో ఎవ్వరు లేని సమయం గమనించిన ధనుంజయ్, ప్రవీణ్ మరో ముగ్గురు కలిసి గత రాత్రి శ్రీనాథ్ ఇంటి మీద దాడికి దిగారు మొదటగా కోపానికి కారణమైన కుక్కను చావు కొట్టేశారు. కర్రలు రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు.
అడ్డువచ్చిన శ్రీనాధ్, ఆయన భార్య స్వప్న ను సైతం తల పగులగొట్టారు.
ఇలాగా చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ధనుంజయ గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు . పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి శ్రీనాథ్ దంపతులు.. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు
తీవ్రంగా గాయపడిన కుక్కకు కూడా చికిత్స చేయిస్తున్నారు .
దాడి సమయంలో సైతం హస్కి కుక్క తోక ఊపుతూ తన విశ్వాసాన్ని ప్రదర్శించింది
అయినా అక్కసుతో యువకులు విచక్షణారహితంగా దాడి పాల్పడ్డారు.
దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి
మధురానగర్ – రహమత్ నగర్లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్పై, శ్రీనాథ్ భార్యపై, పెంపుడు… pic.twitter.com/y3gJBfSlXj
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2024