జ్ఞానవాపి మసీదులో శివలింగ ఆరాధనపై తీర్పును వారణాశి కోర్టు వాయిదావేసింది. జ్ఞాన్వాపి మసీదులో ‘శివలింగ ఆరాధన’కు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి పాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని కూడా పిటిషనర్ విశ్వ వేద సనాతన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ సింగ్ కోరారు. జ్ఞాన్వాపీ కాంప్లెక్స్ను సనాతన్ సంఘ్కు అప్పగించాలని కూడా కోరుతూ మే 24న పిటిషనర్ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వాయిదా వేసింది.