భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పత్రికా స్వేచ్ఛే లేదన్నారు. రెండేళ్ల నుంచి పార్లమెంట్లో సైతం తాను మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. తానుమాట్లాడడం మొదలు పెట్టగానే మైకు ఆఫ్ చేసేస్తారని ఆరోపించారు. ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఇంకా తీవ్ర ఆరోపణలే చేశారు. ఇటీవల తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర విశేషాలు పంచుకున్నారు. ఇక ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని ఓడించడం అసాధ్యం కాదనీ రాహుల్ అన్నారు. దేశంలో శాంతి, సామరస్యాల కోసం మోదీని ఓడించాల్సి ఉందనీ అన్నారు. ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ఫాసిజం ఓడిపోతుందన్న రాహుల్.. భారత దేశపు రెండు దార్శనికతలు ఒకదానితో మరొకటి పోటీ పడితే, తమదే ఆధిపత్యమని చెప్పారు. నాయనమ్మ, తండ్రితో అనుబంధం, ఇంకా అవివాహితుడిగానే ఉండిపోవడం గురించీ రాహుల్ మాట్లాడారు.