రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పై దాడిజరిగింది. బెంగళూర్లో గుర్తు తెలియని ఒకరు మైక్ తో దాడి చేశాడు. కొన్ని సెకన్లలో మరొక వ్యక్తి వచ్చి ఇంక్ ను మొహంపై చల్లాడు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడిహళ్లి చంద్రశేఖర్ అనే రైతు నాయకుడు డబ్బు వసూలు చేస్తూ పట్టుబడిన స్టింగ్ ఆపరేషన్ గురించి స్పష్టం చేయడానికి రాకేష్ టికాయత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రాకేష్ టికైత్పై దాడి చేసిన తర్వాత, కార్యక్రమంలో ఉన్న మరికొందరు కుర్చీలతో ఆ ఇద్దరిపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
ఈవెంట్కోసం వచ్చిన తనకు తగిన భద్రత కల్పించలేదని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు హైగ్రౌండ్స్ పోలీసులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1531186202434744320?s=20&t=F1XqDMc92DrAm9C2MoBrOg
ఈ నెల మొదట్లో వ్యవసాయ వ్యతిరేక చట్ట నిరసనల్లో అగ్రగామిగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ (BKU) రాకేష్ టికాయత్ ను సంస్థ నుంచి బహిష్కరించింది. అతని సోదరుడు నరేష్ టికాయత్ ను కూడా BKU జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.
ఇద్దరు రాజకీయాలు ఆడుతున్నారని, రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించింది. రాజకీయాలతో సంస్థ ప్రమేయంతో సంతోషంగా లేక, BKUకి చెందిన పలువురు నాయకులు రాకేష్ టికాయత్ తో తమ అనుబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.
రైతు సంఘం ఆ తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయింది. విడిపోయిన BKU వర్గానికి రైతు నాయకుడు రాజేష్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహిస్తున్నారు. టికాయత్ సోదరులు రాజకీయం చేస్తున్నారని చౌహాన్ ఆరోపించారు.
https://twitter.com/ANI/status/1531192906987360258?s=20&t=n6xgxqex8kdqJwBA-EZKOA