జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా సోనాలలోని వివేకానంద స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రైతులను ఉపాధ్యాయులు, అధికారులు సన్మానించారు.
ఇక సేద్యానికి వాడే రకరకాల యంత్రాలు, పనిముట్లను పాఠశాలలో ప్రదర్శించారు. వాటిగురించి విద్యార్థులకు వివరించారు.
పూర్వకాలంనుంచీ వాడుతున్న పనిముట్లు, ఆధునికకాలంలో వినియోగిస్తున్న యంత్రాలగురించి విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు వివిధ రకాల వృత్తులపట్ల గౌరవం,వ్యవసాయం మీద అవగాహన,రైతు కష్టం విలువ, అన్నదాతపై గౌరవం పెరగాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల
పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య తెలిపారు.
పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి ఇస్తారి,పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య, పాఠశాల డైరెక్టర్లు కోస్మెట్ శుద్దోధన్,మునిగెల శ్రీధర్,రైతులు పాల్గొన్నారు.