క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అల్లర్లు రేపే కుట్రలో భాగంగానే ఆ ట్వీట్ చేసిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…. సదరు సామాజిక కార్యకర్తపై మండిపడ్డారు నెటిజన్లు.
https://twitter.com/uttarakhandcops/status/1475677721241948160?s=20
డెహ్రాడూన్ లోని లతికారాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ అయిన జో చోప్రా-మెక్ గోవన్ మత విద్వేషాలు ప్రేరేపించేలా ట్వీట్ చేసింది. ఈ రాష్ట్రం క్రిస్మస్ వేడుకల్ని నిషేధించింది. కానీ ప్రతీ దుకాణంలో నేను కలిసిన ప్రతిఒక్కరూ మెర్రీ క్రిస్మస్ మేడం అంటూ నన్ను పలకరించారు. హిందుత్వ వాదులారా మీరు విజయం సాధించలేరు. హిందువులు ఇతర వర్గాల పట్ల అసహనంతో ఉన్నారు. మీ విద్వేషపూరిత ఎజెండాను భారతీయులు అర్థం చేసుకుంటారు అని ట్వీట్ చేసింది.
అయితే ఆమె ప్రచారాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు తిప్పికొట్టారు. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆమెకు గట్టిగానే బదులిచ్చారు. “రాష్ట్రంలో ఎక్కడా క్రిస్మస్ పండుగపై నిషేధం లేదు. ఈ వేడుకను రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి మతోన్మాదుల పుకార్లను పట్టించుకోవద్దు..భారతరాజ్యాంగం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్నిమతాలను సమానంగా గౌరవిస్తుంది..దయచేసి సంయమనం పాటించండి అని విజ్ఞప్తి చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో కాసేపటికే ఆమె తన ట్వీట్ ను తొలగించారు.
దేశవ్యాప్తంగా ఇక్కడా అక్కడా అని కాదు ప్రతిచోటా…ప్రతీరాష్ట్రంలో వామపక్ష- ఉదారవాద మేధావివర్గం హిందుత్వాన్ని తప్పుబడుతూ, వారిపై ద్వేషాన్ని వ్యాప్తిచేసే కుట్రలు చేస్తూనే ఉంది. జో చోప్రా ట్వీట్ దీన్నిమరోసారి రుజువు చేసింది.
హిందువులు ఇతర వర్గాల ప్రజల పట్ల అసహనంతో ఉన్నారని జో వ్యాఖ్యానించింది. ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేయడం ద్వారా హిందూమతంపై విషం చిమ్మింది జో తన ట్విట్టర్ వేదిగ్గా. పలువురు నెటిజన్లు ఆమె తీరును ఎండగడుతూ బదులిచ్చారు. ట్వీట్ తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
డెహ్రాడూన్ కు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్… అలోక్ భట్ ఉత్తరాఖండ్ పోలీసులను టాగ్ చేస్తూ అప్రమత్తం చేశారు… ‘రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారని కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య పుకార్లు రేపడం ద్వారా అల్లకల్లోలం సృష్టించడమే జో చోప్రా ఎజెండా.మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న జోచోప్రాపై ముందుగా సెక్షన్ 295A , 153B కింద ఆమెపై కేసు నమోదు చేయండి. అంతకన్నా ముందు ట్వీట్ ను తొలగించి క్షమాపణ చెప్పమనండి ‘ అంటూ భట్ ట్వీట్ చేశారు.
https://twitter.com/alok_bhatt/status/1475648813557714947?s=20
అంతేకాదు జో చోప్రా NGO పైనా తగిన చర్య తీసుకోవాలని, ఆమె పౌరసత్వం, వీసాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ హోంమంత్రిత్వశాఖనూ ట్యాగ్ చేశారు అలోక్.
https://twitter.com/alok_bhatt/status/1475722247838973957?s=20
ఇక అలోక్ భట్ ట్వీట్ కు మరో నెటిజన్ విజయ్ పటేల్ రిప్లై ఇస్తూ ఎన్జీవోకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. జో, ఆమె భర్త ఎన్జీవోలను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని…విదేశీ సంస్థలనుంచి కోట్లాది నిధులు పొందుతున్నారని…వాటిపై అనుమానాలున్నాయని అన్నారు. అంతేకాదు భార్యాభర్తలిద్దరికీ వేర్వేరు సంస్థలున్నాయని వాటిపై దర్యాప్తు చేయాలని కోరారు.
https://twitter.com/vijaygajera/status/1475724350556827648?s=20