
మలయాళ వార పత్రిక, మాతృభూమి, RSS పై తప్పుడు కథనం ప్రచురించినందుకు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించినందుకు ఆర్ఎస్ఎస్కి క్షమాపణలు…చెప్పింది..
వివరాలు:
మళయాళ పత్రిక ‘ మాతృభూమి ‘ 2011ఫిబ్రవరి, మార్చి నెలలలో RSS పై భీకర్తుడే వైరస్ అంటే “ఉగ్రవాద వైరస్”, అని, “RSS ఉగ్రవాదం భారత్ ని కబళిస్తుందా”? అనే పేరుతో బద్రి రైనా అనే ఆయన రాసిన 5 భాగాల వ్యాసాలను ప్రచురించింది. ఆ వ్యాసాల పరంపర ప్రచురించి తన సంస్థకు పరువు నష్టం కలిగించారు అని RSS సేవకుడు గోపాల కుట్టి లీగల్ నోటీస్ పంపితే, మా రచయిత స్వామి అసీమానంద్ ఇచ్చిన వాంగ్మూం ఆధారంగా ఆ వ్యాసాలు రాశారు అని మాతృభూమి జవాబు ఇస్తే, అసీమనంద్ ఇచ్చిన వాంగ్మూలం ఫోర్జరీ అని కోర్ట్ నిర్ధారించి అసీమానంద్ ని నిర్దోషిగా విడుదల చేసింది అని మళ్ళీ RSS లాయర్ మాతృభూమి పత్రికకు సమాధానం ఇచ్చాడు.
మాతృభూమి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు అని RSS కుట్టి మస్థారు ఎర్నాకులం మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దానిపై మాతృభూమి పత్రిక ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం దావా కొట్టేయమని హైకోర్టు కు వెళ్ళగా, తమ సంస్థ పరువు తీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి పరువు నష్టం దావా వేసే అధికారం ఉంది అని హైకోర్టు చెప్పి, మాతృభూమి పత్రిక అభ్యర్ధనను తిరస్కరించింది.
దీనిపై మాతృభూమి పత్రిక సుప్రీం కోర్టు కి పోతే, హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సబబే పోయి మేజిస్ట్రేట్ కోర్ట్ లో పరువు నష్టం దావా కేసు విచారణ ఎదుర్కొండి అని మాతృభూమి పత్రికకు చెప్పింది.
ఇంకా మెజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు విచారణ జరుగుతూ వుండగానే మాతృభూమి పత్రిక
తాము ” RSS పై ఆధారాలు లేని తప్పుడు కథనాలు ప్రచురించాము. అందుకు చింతిస్తున్నాము” అని క్షమాపణ పత్రికలో ప్రచురించింది.

ఎవరైనా వ్యక్తుల మీద, సంస్థల మీద వారి/వాటి పరువు నష్టం కలిగించే విధంగా వ్యాసాలు రాసినా పుస్తకాలు రాసినా వారిని ఎదుర్కోడానికి ఇది సరి అయిన పద్దతి. అంతే కానీ రాసిన వాళ్ళ మీద ఏ చట్ట పరమైన చర్యలు తీసుకోకుండా, ఊరికే పెడ బొబ్బలు పెడితే ఉపయోగం ఉండక పోగా మరింత మంది అలాగే రాస్తారు..
గాంధీ, నెహ్రూ పరువు తీసే వ్యాసాలు రాస్తున్నారు అని రాసే వాళ్ళను తిట్టుకునే బదులు కాంగ్రెస్ కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలి. లేదంటే అలా వస్తున్న కథనాలు నిజం అని సామాన్య ప్రజలు నమ్ముతారు.
….చాడా శాస్త్రి…..