భారతఆర్మీలోకి కొత్త జీవ ఆయుధం చేరింది. సరిహద్దుల్లోకి చొరబడే డ్రోన్లను వేటాడే గద్దలు ఇక విధుల్లో చేరనున్నాయి. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు నిపుణులు. భారత్-అమెరికా ఉమ్మడి సైనిక దళాల సైనిక శిక్షణ…యుద్ధఅభ్యాస్ లో భాగంగా గద్దలు సైతం తమ విన్యాసాలు ప్రదర్శించాయి. ఉత్తరాఖండ్ లోని ఈ కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా గాల్లో ఓ డ్రోన్ ఎగురవేయగా ముందు ఆర్మీ శునకం సైనికులకు అప్రమత్తం చేసింది. ఇకడ్రోన్లను వేటాడ్డంతో తర్ఫీదు పొందిన అర్జున్ అనే గద్ద డ్రోన్ ఆచూకీని కనిపెట్టి దాన్ని కూల్చేసింది.
ఆర్మీలో ఇప్పటికే శునకాలతో పాటు గద్దలు కూడా ఉన్నప్పటికీ డ్రోన్లను వేటాడేందుకు ప్రత్యేకంగా కొన్ని గద్దలకు శిక్షణనిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో డ్రోన్లను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కశ్మీర్ వైపు డ్రోన్ల చొరబాట్లు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. డ్రోన్ల ద్వారా, స్మగ్లింగ్, గూఢచర్యం కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాక్ చర్యలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఇలా అప్డేట్ అవుతోంది.
https://twitter.com/Defence_United_/status/1597585357343985664?s=20&t=4Q2BU-thtrSt7Nt9qDjYDQ