బంగ్లాదేశీ రచయిత్రి 59 ఏళ్ల తస్లీమానస్రీన్ ను ఫేస్ బుక్ చంపేసింది. ఒక్కసారి కాదు రెండుసార్లు. దీంతో నేను బతికున్నాను మొర్రో అంటూ మరో సోషల్మీడియా వేదిక ట్విట్టర్లో వాపోయిందామె.
ఇన్నిసార్లు ఫెస్ బుక్ తనను చంపేసిందని..అయితే తానింకా సజీవంగానే ఉన్నానని…తన మరణ వార్తను ప్రతిచోటా ప్రచురించాలని తాను కోరుకుంటున్నట్టు తస్లీమా ప్రకటించడంతో పొరపాటైందంటూ తన ఖాతాను పునరుద్ధరించింది తస్లీమా.
జనవరి 18న తస్లీమా చనిపోయిందంటూ ఆమె అకౌంట్ ను మెమొరియలైజ్ చేసింది. దీంతో ట్విట్టర్ వేదిగ్గా ఈ విషయాన్ని చెబుతూ ఆమె ఎమోషన్ అయ్యారు. నేనుబతికే ఉన్నా నా అకౌంట్ ను పునరుద్ధరించండి అంటూ ట్వీట్ చేశారు.
‘నేను ఇంకా బతికే ఉన్నాను, కానీ మీరు నా ఖాతాను మెమొరియలైజ్ చేశారు. ఇది నిజంగా విషాదం కదా.అలా ఎలా చేస్తారు, నాఅకౌంట్ ను తిరిగి నాకు ఇవ్వండి. 59 ఏళ్ల రచయిత్రిని చనిపోయినట్టు ప్రకటిస్తారా అంటూ ట్వీట్ చేశారు. నేను బతికుండగానే చంపేశారు. ఇది జిహాదీల పనే. వాళ్లు నా డెత్ సర్టిఫికెట్ ను తయారు చేస్తున్నారు. ఎఫ్బీకి చేరవేసి నా ఖాతాను మెమొరియలైజ్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. మరునాడు కూడా అలాగే ఖాతాను రెండోసారి మొమెరియలైజ్ చేశారు. ఆమె ఇక లేరని..ఆమెను ఇష్టపడే వ్యక్తులు, తన మనసులోని భావాలు షేర్ చేసుకోవచ్చునని అకౌంట్ చూపించింది. రెండోసారీ అలా జరగడంతో ఆమె మళ్లీ ట్విట్టర్ వేదిగ్గా రియాక్టయ్యారు.
‘నా మరణ వార్త ప్రతిచోటా పబ్లిష్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నా శరీరాన్ని ఆస్పత్రికి దానం చేయండి పరిశోధన కోసం. అవయవ మార్పిడి కూడా చేస్తాను. ఎవరైనా నా కళ్లతో లోకం చూడాలి. ఇతరులూ తమ శరీరాన్ని దానం చేసేలాగా నానుంచి ప్రేరణ పొందాలి. నాజీవితమే కాదు… చావు కూడా అర్థవంతం కావాలని నేనుకోరుకుంటున్నా’ అని అన్నారు. దీంతో మరోసారి ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను పునరుద్ధరించారు.
ఇస్లామిస్ట్ తీవ్రవాదుల బెదిరింపులతోనే 27 ఏళ్లక్రితం తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ను వీడివచ్చి భారత్ లోనే ఉంటున్నారు. ఇస్లాంలోని లోపాలను ఎత్తిచూపుతూ వాళ్లకు పదే పదే టార్గెట్ అవుతుంటారు.
అయితే తరచూ తస్లీమా ఎఫ్బీ అకౌంట్ బ్లాక్ అవుతుంటుంది. కొన్నినెలల క్రితం బంగ్లాదేశ్ లోని హిందువులపై వరుస దాడులు జరిగాయి. ఆక్కడి ఆలయాల్ని ఇస్లామిస్టులు ధ్వంసం చేశారు. వాటిపై స్పందిస్తూ ఆమె పోస్టులు పెట్టారు. దీంతో వారం రోజుల పాటు ఆమె ఖాతాను బ్లాక్ చేసింది ఎఫ్బీ. 2015లోనూ హిందువులపై బంగ్లాదేశ్లో దాడులపై పోస్టులు పెట్టినప్పుడూ ఖాతా బ్లాక్ అయింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ప్రస్తావిస్తూనే ఆమె రాసిన నవల ‘లజ్జ’ వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. చంపేస్తామన్న ఇస్లామిస్టుల హెచ్చరికలతో 1994లో స్వదేశాన్ని వీడిన ఆమె భారత్ వచ్చి అప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్నారు.
https://twitter.com/taslimanasreen/status/1483395772876206080?s=20