వృద్ధ తల్లిదండ్రులతో సమయం గడిపేలా ఉద్యోగులకు అదనంగా ఏడు రోజుల సెలవులు ప్రకటించారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. 2021 ఆగస్టులోనే ఆయనీ ప్రకటన చేశారు అయితే ఇకనుంచి అమల్లోకి రానుంది. ఏటా ఏడు రోజులు సెలవు మంజూరు చేస్తామన్నారు.అయితే ఆ సెలవుల్ని వారు విధిగా తల్లిదండ్రులతోనే గడపాలనే కఠిన నిబంధన విధించారు. తల్లిదండ్రుల్ని ఎవరూ వృద్ధాశ్రమాలకు పంపకూడదనే సంకల్పం తీసుకోవాలని పదేపదే విజ్జ్ఞప్తి చేశారు హిమంత. అస్సాం ఎంప్లాయీస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ అమెండ్మెంట్ బిల్లును అమల్లోకి తెస్తూ…వృద్ధుల సంరక్షణను ఉద్యోగుల వేతనానికి అనుసంధానంచింది ప్రభుత్వం .