ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. అంతకుముందు ఆయన్ని రాఘవరెడ్డిని కోర్టులో హాజరుపర్చారు. ఆ సమయంలో ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఇక మార్చి 13న మాగుంట ఆయన బెయిల్ పిటిషన్ ను విచారించనుంది. రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10న ఈడీ రాఘవను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.