బంగ్లాదేశ్తో సరిహద్దుగా గల అసోం, పశ్చిమబెంగాల్.. పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు లోపల 15 కిలోమీటర్ల నుంచి సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధిని పొడిగిస్తూ…కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటీసును సవరించింది. BSF డిసెంబర్ 1965 లో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దును కాపాడటానికి ఒక ప్రత్యేక శక్తిగా నియమితమైంది.
అంతర్జాతీయ సరిహద్దులతో పాటు… మాదకద్రవ్యాలు, నకిలీ కరెన్సీ రాకెట్ ను కంట్రోల్ చేసే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ లో డ్రగ్స్ , ఆయుధాల స్మగ్లింగ్ కొత్త సవాలుగా మారింది. అస్సాం,పశ్చిమ బెంగాల్ నుంచి పశువుల అక్రమరవాణా,FICN,అక్రమ బంగ్లాదేశ్, రోహింగ్యా వలసలకు కేంద్రాలుగా ఉన్నాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ 1968 సెక్షన్ 139 కింద అధికారం పొందిన బీఎస్ఎఫ్ , స్మగ్లింగ్ రాకెట్లను అరికట్టడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంది హోంమంత్రిత్వశాఖ.
సోమవారం జారీచేసిన నూతన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పాస్ పోర్ట్ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం, కస్టమ్స్ చట్టం కింద సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో శోధిస్తూ స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేస్తే అధికారం బీఎస్ఎఫ్ కు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ , లడఖ్ ప్రాంతాలతో పాటు మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ మరియు మేఘాలయలలో ఇతర ఈశాన్య రాష్ట్రాలలో బిఎస్ఎఫ్కు ఇలాంటి అధికారాలే ఉంటాయిక.
అటు గుజరాత్లో BSF అధికార పరిధి 80 కిలోమీటర్లనుంచి 50 కిలోమీటర్లకు తగ్గించారు. రాజస్థాన్ లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ బీఎస్ఎఫ్ 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రాంతాన్ని కాపాడుతుంది.
అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలలో కార్యాచరణ ప్రాంతంలో ఏకరీతి తీసుకురావడమే ప్రాథమిక ఆలోచన. అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే గుజరాత్ లోని విస్తారమైన రాణాఆఫ్ కచ్ జనసాంద్రత తక్కువ ఉన్న భాగం. అందువల్ల అక్కడ అంత పెద్ద కార్యాచరణ అవసరం లేదు.
అయితే ఎప్పటిలాగే పంజాబ్ ను ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ను ఏలుతున్న టీఎంసీ ప్రభుత్వాలు దాడి మొదలుపెట్టాయి. ఫెడరలిజం ఏమైందంటూ…కేంద్ర ఏజెన్సీల ద్వారా జోక్యం ఏంటంటూ విమర్శలు ప్రారంభించాయి.
“అంతర్జాతీయ సరిహద్దుల వెంట BSF కి అదనపు అధికారాలు ఇవ్వాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని,…ఇది సమాఖ్యవాదంపై ప్రత్యక్ష దాడి అని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రహోంమంత్రిని విన్నవిస్తున్నా”అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చాన్నీ ట్వీట్ చేశారు.
ఈ నిర్ణయం ద్వారా “పంజాబ్లో సగం ఇప్పుడు BSF అధికార పరిధిలోకి వస్తుంది” అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఇది అత్యవసర స్థితివంటిదని, పంజాబీల దేశభక్తిని అవమానిస్తున్నారనీ అన్నారు.
అయితే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి క్యాప్షన్ అమరీందర్ సింగ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. దీన్ని రాజకీయం చేయవద్దని ముఖ్యమంత్రిని , కాంగ్రెస్ పార్టీని కోరారు.
బీఎస్ఎఫ్ మెరుగైన సామర్థ్యాలు పంజాబ్ ను కాపాడుతాయని, రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేస్తాయని కెప్టెన్ అన్నారు. కశ్మీర్లో ఎందరో సైనికులు చనిపోతున్నారు. పాక్ మద్దతుఉన్న ఉగ్రవాదులు పంజాబ్ లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల్ని అక్రమంగా రవాణాచేయడం చూస్తున్నాం. కేంద్ర సాయుధ దళాలను రాజకీయాల్లోకి లాగవద్దు, ”అని ఆయన విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి ఫిర్హాద్ హకీమ్ BSF కార్యాచరణ ప్రాంతాన్ని విస్తరించడం ద్వారా దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, ఇది కేంద్ర ఏజెన్సీల ద్వారా జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

file photo