ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న రాజస్థాన్ లోని దౌసాలో ఢిల్లీ -ముంబయి ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.అందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే దౌసాలో పోలీసులు పెట్రోల్ పోసుకుంటుండగా…కలెక్టరేట్కు 500 మీటర్ల దూరంలో అనుమానాస్పద వాహనం కనిపించింది.దాన్ని తనిఖీ చేయగా లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయి. అందులో 10 క్వింటాళ్ల 40 బస్తాల డిటోనేటర్లు, కనెక్టింగ్ వైర్లు, ఇతర వస్తువులు కనిపించాయి. వెహికిల్ డ్రైవర్ మీనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల్లో ప్రధాని పర్యటన ఉండడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది.