అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కమిటీకి నేతృత్వం వహిస్తారని తెలిపింది. జస్టిస్ ఓపీ భట్, జస్టిస్ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేషన్ ను కమిటీ సభ్యులుగా నియమించింది. సేబీ ప్రస్తుతం కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు.
షేర్లలో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని…సంస్థవన్నీ మోసాలేనంటూ హిండెన్ బర్గ్ బయటపెట్టిన నివేదిక సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1631177060109385728?s=20