18 ఏళ్లు నిండిన అందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ 19 టీకా కోసం 18 ఏళ్ళు నిండిన వారందరూ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని… కరోనానుంచి మనల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందనీ అన్నారు. ఇలాంటి సమయంలో అన్నింటికన్నా మనోధైర్యం ముఖ్యమని అన్నారు. గతంలో స్పానిష్ ఫ్లూ, ప్లేగు వంటి రోగాలను ఇలా టీకాలతో జయిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు.