తల్లిమరణం తీవ్రంగా కలిచివేస్తున్నా …విధిగా విధుల్లో పడిపోయిన ప్రధాని మోదీపై దేశప్రజలు సహా, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ కర్మయోగి అని, అలాంటి నాయకుడు పాలకుడిగా ఉండడం భారతీయుల అదృష్టమని నెటిజన్లు వివిధ సోషల్మీడియా వేదికలపై స్పందిస్తున్నారు. ఓ వైపు బాధ గుండెల్ని పిండేస్తున్నా..దేశం కోసం పనిచేసే మోదీ వంటి నాయకులు అతి తక్కువ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఆయనకు దేశమే ముందు అని వ్యక్తిగతం తరువాత అని అన్నామలై ట్వీట్ చేశారు. ఇక మోదీ నిబద్ధత, కార్యదీక్షతను ఎంతపొడిగినా తక్కువేనన్నారు మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అధికారిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసుకోవద్దని మోదీ తమకు చెప్పారని రాజ్ నాథ్ అన్నారు. అమిత్ షా సైతం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం కర్నాటకలో పర్యటించారు.