తనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు
బిద్రెవెర్ కళాకారుడు షా రషీద్ అహ్మద్. ఈ సందర్భంలో స్వయంగా ప్రధానితో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం అనే ఒకే ఒక కారణంగా బీజేపీ నాకు పద్మశ్రీ ఆవార్డు ఇవ్వదు అనుకున్నా. కానీ తాను ఎంత పొరపాటుగా ఆలోచించానో అర్థమైందనీ అన్నారు. అయితే కాంగ్రెస్హయాంలో సైతం తనను గుర్తించలేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం అనే అభిప్రాయం సామాన్యుల్లో, కొందరు ప్రముఖుల్లోనూ ఉందని…అయితే మోదీవంటివారు అలాంటి అభిప్రాయం తప్పని నిరూపించారన్నారు.
నిన్న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో షా రషీద్ అహ్మద్ ఖాద్రీ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము నుంచి అవార్డు తీసుకున్న తర్వాత ఆయన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ అన్న ఈ మాటలు సంచలనం అయ్యాయి. ” UPA ప్రభుత్వం నాకు పద్మ అవార్డ్ ఇస్తుంది అని ఆశించాను. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నాకు అవార్డు ఇస్తుందని నేను అస్సలూహించలేదు. నా ఆలోచన తప్పని మోదీ నిరూపించారు” అని షా రషీద్ అన్నారు.