ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీనే తిరిగి నియమితులవుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా సరే..ఆయనవైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తేవడంతో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీకోసం ఆయన చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి ఆయనకే అవకాశం ఇవ్వాలని పార్టీసీనియర్లు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర పరిశీలకులుగా వచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ బీజేపీ నేతలతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించారు.
ఇవాళ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ధామీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ధామీ సీఎం అయ్యాక ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి ధామీని గెలిపించాలని పార్టీ నిర్ణయించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 47 స్థానాలను దక్కించుకుంది బీజేపీ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)