పాకిస్తాన్ ను వెనకేసుకొస్తోంది ఇందుకే..
యూరోపియున్ కమిషన్ పాకిస్తాన్ ను ఎందుకు వెనకేసుకు వస్తోంది? లండన్ నుంచి వెలువడే ఈయూ క్రానికల్ పత్రికలో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు థియరీ మరియాని రాసిన ఆర్టికల్ లో అందుకు సంబంధించిన వివరాలున్నాయి. ”ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మనీలాండరర్ను, ఉగ్రవాదుల ఆర్థిక మూలలను రక్షిస్తోంది. అటువంటి పాకిస్తాన్ ను యూరోపియన్ కమిషన్ వెనకేసుకు రావటాన్ని” ప్రశ్నించారు.
ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను తయారు చేయటం కూడా ప్రశ్నించారు. “ఇంగ్లాండ్ కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ అక్టోబర్ 23 న నిర్వహించిన ప్లీనరీ సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడుతూ ” పాకిస్తాన్ కు ఉగ్రవాదులను అణచటానికి ఇచ్చిన ఆర్థిక వనరులను ఉపయోగించటంలో ప్రమాణాలు పాటించడంలో పూర్తి గా విఫలమైనదని దుయ్యబట్టారు. ‘ఆల్-యాక్షన్ ప్లాన్ గడువు ముగిసింది’ అని పేర్కొంటూ పాకిస్థాన్ ను ప్లీనరీ గ్రే జాబితాలో ఉంచారని చెప్పారు. ఇక ఈ విషయాలు కూడా పత్రికలో వచ్చాయి. ఇస్లామాబాద్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మనీలాండరింగ్, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి తమ బాధ్యతలను నెరవేర్చటంలో విఫలమైనదని, పైగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరునిగా ప్రశంసిస్తూ మాట్లాడారు . జమాత్ ఉద్-దావా (జుడి) అధిపతి, హఫీజ్ సయీద్, మరియు జైష్-ఎ-మహ్మద్ (88) ఉగ్రవాద సంస్థలపై మరియు వారి నాయకులపై ‘కఠినమైన’ ఆర్థిక ఆంక్షలు విధించకుండానే విధించినట్లు చెబుతూ ఎఫ్ఎటిఎఫ్ను మోసం చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు . ఆ ఆర్టికల్ లో పాకిస్తాన్ దుశ్చర్యలను, పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే నేరస్థులను తనిఖీ చేయడానికి ఫాలో-ది-మనీ వ్యూహాన్నిపాటించాలని మరియాని సిఫార్సు చేశారు. వారిలో ఒకరు అల్తాఫ్ ఖానాని, మాదకద్రవ్యాల వ్యాపారం, అల్-ఖైదా, హిజ్బుల్లా, తాలిబాన్ వంటి జిహాదీ ఉగ్రవాద గ్రూపుల కోసం బిలియన్ డాలర్ల డబ్బును సమకూరుస్తున్నారు. అల్తాఫ్ ఖానాని ని యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ పనామాలో 2015 సెప్టెంబర్లో అరెస్టు చేసింది. అతన్ని అమెరికాకు పంపించి 68 నెలల జైలు శిక్ష విధించింది . శిక్ష పూర్తి అయ్యి ఈ సంవత్సరం జూలై 13 న జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అతని ఆచూకీ తెలియటం లేదు. పాకిస్తాన్, ఖానానీ ఇద్దరూ మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు ఆర్ధిక వనరులుసమకూస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ మొదలైన ప్రాంతాలను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులను ప్రాక్సీలుగా ఉపయోగించుకొంటోందని అమెరికా అధికారులు చాలాకాలంగా ఆరోపిస్తున్నారని కూడా రాశారు. ప్రభుత్వమే కావాలని ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుంటే అటువంటిపాకిస్థాన్కు యూరోపియన్ కమిషన్ ఎందుకుమద్దతు ఇస్తున్నదో చెప్పాలంటూ నిలదీశారు.
– రాంపల్లి మల్లికార్జున్