కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.ఆర్థికశాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యంత రహస్య సమాచారం అందిస్తున్నట్టు డిల్లీ పోలీస్ క్రైం చ్రాంచ్ గుర్తించింది.
గూఢచర్యం ఆరోపణలకో ఆర్థికశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నసుమిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేట్ గా పనిచేస్తున్న అతను…కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడు. అందుకోసం అతనికి భారీగా డబ్బులు ముట్టినట్టు పోలీసులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.